జనగామ: ప్రతి జిల్లాకు పార్టీ కార్యాలయం ఉండాలని టీఆర్ఎస్ పార్టీ సంకల్పించింది. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం జరుగుతున్నది. జనగామలో కూడా టీఆర్ఎస్ పార్టీ జల్లా కార్యాలయ నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో పార్టీ జనగామలో పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli Dayaker Rao ) మీడియాతో మాట్లాడారు.
జనగామలో పార్టీ ఆఫీస్ నిర్మాణం పూర్తయిందని, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అదేవిధంగా మిగతా జిల్లాల పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఈ నూతన కార్యాలయాలు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమవుతాయన్నారు. జిల్లా పార్టీ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో నిర్మిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.