హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొని తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ బుధవారం బీఆర్కే భవన్లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారీ జన సమీకరణతో బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ ఖమ్మంలో విజయవంతమైన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పువ్వాడ సోదరుడి కొడుకు పెండ్లి ఫిబ్రవరి 10న ఉండగా, పెండ్లికి రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేశారు.