హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 13 మంది తాసిల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కొందరికి పోస్టింగులు ఇచ్చింది. సెలవుపై వెళ్లి వచ్చిన కిశోర్కుమార్, జీ లక్ష్మణ్, బీ భాస్కర్, జే సంజీవకు తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. టీఎస్ఐఐసీలో పని చేస్తున్న ఏ నిర్మలను తాలిమ్కు, ఏపీఎస్ఎఫ్సీ నుంచి తిరిగి వచ్చిన బీ ప్రేమలత, మహ్మద్ అష్రఫ్ అహ్మద్, ఏకే అనురాధ, మెదక్ జిల్లాకు చెందిన మజర్ అలీని హెచ్ఎండీఏకు, జీ జగదీశ్వర్ను నారాయణపేట జిల్లాకు, నల్లగొండ జిల్లాకు చెందిన మహ్మద్ ఇలియాస్ అహ్మద్ను మైనారిటీ వెల్ఫేర్ విభాగానికి బదిలీ చేసింది.