మంగపేట, డిసెంబర్ 31 : న్యూఇయర్ వేడుకల్లో విషాదం చోటుచేసుకున్నది. కేక్ తీసుకొస్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో యువకుడు దుర్మరణం చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. తిమ్మంపేటకు చెందిన గొగ్గెలి సంజయ్ (18), అతడి మిత్రుడు బోస్ కలిసి న్యూఇయర్ సందర్భంగా మంగపేటలో కేక్ కొనుగోలు చేసి బైక్పై తిరిగి వస్తున్నారు. బోరునర్సాపురం-చెరుపల్లి గ్రామాల మధ్య బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. సంజయ్ అక్కడికక్కడే మృతిచెందగా, బోస్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు సంజయ్ ఏటూరునాగారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు.