హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణకు వీలుగా నూతన పీఆర్సీ కమిటీని నియమించి, ఐఆర్ను వెంటనే ప్రకటించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ హాలులో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముదిరేసి చెన్నయ్య, సుంకరి భిక్షంగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మారెడ్డి అంజిరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సంఘం గౌరవాధ్యక్షుడు పర్వతి సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్రావు, ప్రచార కార్యదర్శి ఎం చంద్రయ్య సమావేశంలో పాల్గొన్నారు.