Azharuddin | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ కాంగ్రెస్లో ముసలం పుట్టించింది. తనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై టీపీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తీవ్ర మనస్థాపం చెందారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ పెద్దలు తనకు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు వేరే వాళ్లకు దానిని కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా అమీర్ ఆలీఖాన్కు ఎలా పదవి ఇస్తారని మండిపడ్డారు. తాను పార్టీ కోసం 18 ఏండ్లుగా పని చేస్తున్నానని గుర్తుచేశారు. ఏఐసీసీ పెద్దలతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని అజారుద్దీన్ చెప్పారు.