హైదరాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో మరోసారి మహేశ్వర్రెడ్డి ఎపిసోడ్ కాకరేపుతున్నది. మహేశ్వర్రెడ్డి పార్టీ మారుతున్నారని భావించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఉన్నపళంగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, గంటలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కారణం చెప్పకుండా షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డిపై మహేశ్వర్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పేంటో, ఎందుకు నోటీసులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డికి తెలియకుండా తనకు నోటీ సు ఇచ్చారని అనుకోవడం లేదని చెప్పా రు. తనను కాంగ్రెస్ నుంచి తరిమేసేందుకు కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన చిన్నారెడ్డితో పాటు మరికొంత మందికి నోటీసులు ఇవ్వకుండా తనకెందుకు ఇచ్చారని నిలదీశారు. తన కు నోటీసులు ఇవ్వడంపై అధిష్ఠానం వ ద్దే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. నే డో రేపో జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలి సి, రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న అన్ని అంశాలను వివరిస్తానని తెలిపారు.