హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : గతంలో వాయిదా పడ్డ మరో రెండు పరీక్షల షెడ్యూళ్లను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ అండ్ బీ) పరీక్షను జూలై 13, 14న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఇక మున్సిపల్ శాఖలో టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షను జూలై 8న జరుగుతుందని వెల్లడించారు. ఈ రెండు పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
శుక్రవారం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పరీక్ష శుక్రవారం సజావుగా నిర్వహించినట్టు అనితారామచంద్రన్ తెలిపారు. ఉదయం పరీక్షకు 10,760 (60.48%), మధ్యాహ్నం పరీక్షకు 10,704 (60.17%) మంది అభ్యర్థులు హాజరైనట్టు వెల్లడించారు. 18 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మొత్తం 17,789 దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు.