హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : సందీప్కిషన్ నటించిన ‘ఊరిపేరు భైరవకోన’ సినిమాపై పిటిషన్ పెండింగ్లో ఉండగానే చిత్రప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. విశాఖకు చెందిన గాయత్రి ఫిలిమ్స్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ నంద విచారణ జరిపారు. సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ వినతిని తోసిపుచ్చారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.