హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ఈ నెల 13న అంబేద్కర్ జయంతి జ్ఞాన యాత్ర నిర్వహించనున్నట్టు ప్రజా సంఘాల ఫ్రంట్ సభ్యులు తెలిపారు. ఈ యాత్రను ట్యాంక్బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మంత్రి కొప్పుల ఈశ్వర్ జెండా ఊపి, ప్రారంభిస్తారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో యాత్రకు సంబంధించిన బ్రోచర్, పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. యాత్రలో నగర ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.