Telangana Public Schools | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ను ప్రస్తుతానికి పైలట్ పద్ధతిలోనే ప్రారంభిస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున వీటిని ప్రారంభించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూ ల్స్ పెడతామని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు రూ.500 కోట్లు ప్రతిపాదించింది. రాష్ట్రంలో 614 మండలాలున్నాయి. వీటిల్లో మండలానికి ఒకటి చొప్పున ఇంటర్నేషనల్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.