హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెద్దన్నలాంటి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్), అసోసియేట్ అధ్యక్షుడిగా సత్యనారా యణగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఎన్నికల్లో ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల అధికారి సుగుణాకర్రెడ్డి, సహాయ ఎన్నికల అధికారి సురేశ్ వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.
ఇప్పటి వరకు వీరే అధ్యక్షప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తుండగా, రెండోసారి ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో 17 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.