హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ హామీ ఇచ్చారు. త్వరలోనే మున్సిపల్శాఖ మంత్రితో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి పాటుపడతామని చెప్పారు.
తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల ఫోరం సమావేశాన్ని బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో నిర్వహించారు. 31 జిల్లాల నుంచి విచ్చేసిన ప్రతినిధులు మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర కన్వీనర్గా జీ ప్రభాకర్, కో కన్వీనర్గా టీ పర్వతాలు, సభ్యులుగా సీహెచ్ శ్రీనివాస్గౌడ్, ఆర్ వెంకట్గోపాల్, బట్టి రమేశ్ను ఎన్నుకున్నారు.