హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ (RTC govt merger) విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై (Governor Tamilisai) తీరుకు నిరసనగా ఆర్టీసీ (TSRTC) కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా (Dharna) విజయవంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచే డిపోల ముందు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీల ధరించి నిరసన తెలిపారు. దీంతోబస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గవర్నర్కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికుల ధర్నాతో ఉదయం 6 నుంచి 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాగా, రాజ్భవన్ ముట్టడికి తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMU) పిలుపునిచ్చింది.
ఉదయం 9 గంటలకల్లా ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ ట్యాంక్బండ్లోని నెక్లెస్ రోడ్డుకు చేరుకోవాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు రాజ్భవన్ ముట్టడికి బయలుదేరుతామని చెప్పారు. ఎలాంటి సాగదీతలు లేకుండా వెంటనే ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.