హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీ ద్వారా భక్తులు కానుకలుగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను మార్చి 7న ఈ -వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషి యో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్వెల్, ఫాస్ట్ ట్రాక్ కంపెనీల వాచీలు ఉన్నాయి. వివో, నోకియా, కార్బన్, సాంసంగ్, మోటొరోలా, ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 22 లాట్లు, మొబైల్ ఫోన్లు 18 లాట్లను రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలంలో ఉం చారు. ఈ మేరకు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని (0877-2264429 ఫోన్ నంబరు), టీటీడీ వెబ్సైట్ www. tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www. konugolu. ap.gov.inను సంప్రదించాలని టీటీడీ అధికారులు తెలిపారు.