హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా టీకా పంపిణీలో భారత్ 100 కోట్ల డోసుల మైలురాయిని అందుకోగా, తెలంగాణ రాష్ట్రం 3 కోట్ల డోసులు పంపిణీ పూర్తిచేసింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. కోఠి డీఎంఅండ్హెచ్ క్యాంపస్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎస్ సోమేశ్కుమార్, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు.