జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి కార్మికుల వయోపరిమితి 61 సంవత్సరాల పెంచడం హర్షణీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో మూడు కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ నెల 26వ తేదీన జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రారంభిస్తామన్నారు.
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు .జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయమన్నారు. సీఎంకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : నీటి గుంటలో పడి బాలుడు మృతి
హనుమంతరావును పరామర్శించిన గవర్నర్ దత్తాత్రేయ
ముంబైని ముంచెత్తుతున్న వానలు.. వీడియో