హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతి సిలబస్పై పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పష్టతనిచ్చారు. 2022-23 విద్యాసంవత్సరంలో 100 శాతం సిలబస్ ఉంటుందని వెల్లడించారు. విద్యార్థులకు పూర్తి సిలబస్ను బోధించి, గతంలో మాదిరిగా 11 పేపర్లతో వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా 70 శాతం సిలబస్నే అమలుచేస్తున్నారు.
వార్షిక పరీక్షలను 6 పేపర్లకు కుదించారు. 2020 -21,2021 -22 విద్యాసంవత్సరాలకు మాత్రమే సిలబస్ కుదింపునకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, తాజాగా కరోనా తీవ్రత తగ్గడంతో పూర్తి సిలబస్ ఉంటుందని అధికారులు చెప్పారు.