హైదరాబాద్, డిసెంబర్ 31: ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలోని ప్రధాన నగరాల్లో కేసులు పెరుగుతున్నాయని, జనవరిలోనే పీక్స్టేజ్కి చేరొచ్చని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు రూపొందించిన సూత్ర గణిత మోడల్ అంచనావేసింది. దేశం మొత్తం వ్యాపించడానికి మరింత సమయం పడుతుందని తెలిపింది. దేశంలో మూడో వేవ్ మార్చి మొదట్లో గరిష్ఠ స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో వారం రోజుల ముందే గరిష్ఠ స్థాయి కేసులు నమోదు కావొచ్చని తెలిపింది. వేవ్ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు రోజుకు 2 లక్షల కేసులు నమోదు కావొచ్చన్నారు. కచ్చితమైన అంచనాకు కొన్నివారాలు ఆగాలని సూత్ర కన్సార్షియం సభ్యుడు, ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ చెప్పారు. ‘భారతీయుల్లో డెల్టా కారణంగా సహజ ఇమ్యూనిటీ వచ్చింది. వ్యాక్సిన్తో మరింత పెరిగింది. ఈ ట్విన్ ఇమ్యూనిటీ ఒమిక్రాన్పై ప్రభావం చూపుతుంది’ అని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ అన్నారు.