శామీర్పేట, డిసెంబర్ 10 : అలియాబాద్(Aliabad,)లో వరుస చోరీలు(Robberies) ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత రెండు రోజులుగా నాలుగు ఇండ్లలో గుర్తు తెలియని దుండగులు(Thieves) చోరీకి యత్నించారు. దీంతో ప్రజలు దొంగల భయానికి జంకుతున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి(Medchal malkaj giri) జిల్లా శామీర్పేట మండలం అలియాబాద్ గ్రామ పరిధిలోని విశ్వనాథ్ కుటుంట సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు.
ఆదివారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. పక్కనే ఉన్న మరో ఇంట్లో, రెండు రోజుల ముందు ఓ పార్టీ కార్యాలయం, వృద్ధురాలి ఇంట్లో చోరీకి యత్నించినట్లు స్థానికులు తెలిపారు. కాగా, పోలీసులు గస్తీని ముమ్మరం చేసి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.