హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాధనలో, స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యమని, అప్పటికి ఆ పార్టీ ఉనికిలోనే లేదని పలువురు వక్తలు స్పష్టంచేశారు. అదీగాక బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ నేతలు బ్రిటిష్ తొత్తులుగా వ్యవహరించి దేశ ద్రోహానికి పాల్పడ్డారని, నేడు దేశ భక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టడమే కాషాయ నేతల ధ్యేయమని, అందులో భాగంగానే సెప్టెంబర్ 17 పేరిట కుట్రలు చేస్తున్నారని, చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ కుట్రలను మేధావులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘సెప్టెంబర్ 17 తెలంగాణ విలీనమా? విమోచనమా? బీజేపీ, ఆర్ఎస్ఎస్కు సంబంధం ఏమిటి?’ అనే అంశంపై ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రజాసంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు మాట్లాడారు. సెప్టెంబర్ 17 విమోచన దినం కాదని, జాతీయ సమైక్యత దినంగానే పాటించాలని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.
పార్లమెంట్కూ పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. అక్టోబర్ 26న చలో భీమ్ పేరిట ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి మేధావులు, ప్రజాసంఘాల నేతలు తరలిరావాలని కోరారు. సమావేశంలో ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్, పలు ప్రజాసంఘాలు నేతలు మందాల భాసర్, ఓరుగంటి వెంకటేశ్గౌడ్, ఇటుక రాజు, సుజిత్, శ్రీకృష్ణ, బోరెల్లి సురేశ్, రామగల సుందర్, మేకపోతుల నరేందర్గౌడ్, లావణ్య, పాండురంగ, చరణ్, దేవరకొండ నరేశ్, ధనరాజ్, గణేశ్, నక మహేశ్, వైరపోగు సాంబశివుడు, తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో పార్లమెంట్ భవనానికి అంబేదర్ పేరుపెట్టాలని సీఎం కేసీఅర్ తీర్మానించడం గొప్ప విషయం. మంచి ఆలోచన. అంబేదర్కు గొప్ప నివాళి. దీనిని ప్రజాసంఘాలు మరింత బలంగా ముందుకు తీసుకుపోవాలి. సెప్టెంబర్ 17 రజాకార్ వ్యతిరేక ఉద్యమం. సమర యోధుల పోరాటాలను స్మరించుకునే దినోత్సవం. బీజేపీ ఆ చరిత్రను వక్రీకరిస్తున్నది. భావితరాలకు వాస్తవాలను తెలియజేయాలి. ప్రజా సంఘాలు ఆ బాధ్యతను తీసుకోవాలి.
– దుద్దిళ్ల శ్రీధర్బాబు, మంథని ఎమ్మెల్యే
సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగానే నిర్వహించుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాటంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. కానీ నేడు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు కావాలనే దురుద్దేశంతోనే సెప్టెంబర్ 17ను రాజకీయం చేస్తున్నాయి. ఉత్తరాది సంస్కృతిని దక్షిణ భారతదేశంపై రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆటలు తెలంగాణ గడ్డపై సాగనివ్వం.
-పిడమర్తి రవి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్
చరిత్రలో సెప్టెంబర్ 17కి ప్రాముఖ్యత లేదు. ఆపరేషన్ పోలోకు ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు. నాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణగదొకడం కోసమే పోలీస్ చర్య చేపట్టారు. కానీ బీజేపీ ఆ చరిత్రను వక్రీకరిస్తున్నది. మతరంగు పులుముతూ రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నది. మానిన గాయాలను మళ్లీ రేపుతున్నది. దీనిని మేధావులు ముక్త కంఠంతో ఖండించాలి. కేవలం మతప్రాతిపదికన పాలన సాగించాలన్నదే బీజేపీ విధానం. ఇది తెలంగాణకు, దేశానికి ప్రమాదకరం.
-రాజారాంయాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు
దేశప్రతినిధులు కాదు, బీజేపీ నేతలందరూ దేశద్రోహులు. స్వాతంత్రం గురించి మాట్లాడే నైతిక హకు బీజేపీకి ఎంతమాత్రం లేదు. చరిత్ర వక్రీకరణకు పాల్పడుతున్నది. మేధావులు ఖండించాలి. బీజేపీని బొంద పెట్టాలి. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు ఖరారు చేయడం హర్షణీయం. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. నూతన పార్లమెంట్కు అంబేదర్ పేరు పెట్టాలని అక్టోబర్ 26న చలో భీమ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. ఢిల్లీకి తరలిరావాలి.
-గజ్జెల కాంతం, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్
కమ్యూనిస్టుల చరిత్రను కాలరాయడమే లక్ష్యంగా నాడు పోలీస్ చర్య జరిగింది. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినమనేది అర్థరహితం. అదే విమోచన దినమైతే ఉద్యమాలు ఎందుకు వచ్చాయి? బలిదానాలు ఎందుకు జరిగాయి? నేడు హిందూ ముస్లింల విభజన కోసమే బీజేపీ రాజకీయాలు చేస్తున్నది. ఏనాడూ అరెస్సెస్ కార్యాలయం ఎదుట జాతీయ జెండా ఎగరేయని వారు నేడు మాట్లాడుతున్నారు. బీజేపీ ఇకనైనా తన విధానాలను మార్చుకోవాలి. సమైక్యతకు తూట్లు పొడవద్దు.
– రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ, సీపీఎం నేత జీడీ నరసింహ,