HomeTelanganaThese Are The State Governments Efforts To Increase St Reservation
ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఇవీ..
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చెల్లప్ప నేతృత్వంలో కమిషన్ను నియమిస్తూ 2015 మార్చి 3న (జీవో ఎంఎస్ నంబర్ 5) రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చెల్లప్ప నేతృత్వంలో కమిషన్ను నియమిస్తూ 2015 మార్చి 3న (జీవో ఎంఎస్ నంబర్ 5) రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తూ డాక్టర్ చెల్లప్ప కమిషన్ 2016 డిసెంబర్ 8న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
చెల్లప్ప కమిషన్ ప్రతిపాదనలకు 2017 ఏప్రిల్ 15న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2017 ఏప్రిల్ 16న ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది.
2017 మే 29న ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.
2011 తెలంగాణ రాష్ట్ర జనాభాకు అనుగుణంగా తెలంగాణ గిరిజనుల రిజర్వేషన్లు 9.08 శాతానికి తగ్గకుండా ఉండాలని పేర్కొంటూ కేంద్ర గిరిజన శాఖ రాష్ర్టానికి (ఎఫ్ నంబర్ 42018/24/2017 ఎస్టాబ్లిష్డ్ డేట్ 8.12.2017 పేరుతో) లేఖ రాసింది. దీనికి అనుగుణంగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలు చేయడం కోసం రాష్ట్రపతి అనుమతి కావాలని కోరుతూ సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 4న కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం నుంచి స్పందన రాకపోవడంతో 2019 అక్టోబర్ 4న ప్రధానమంత్రికి మరొకసారి లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం, సీఎం కేసీఆర్ రాసిన లేఖలకు అనుగుణంగా నిర్ణయం ప్రకటించాలంటూ 2021 ఫిబ్రవరి 5న రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కేంద్రానికి మరోలేఖ రాసింది.
రాష్ట్రంలో ఎస్టీల రిజర్వేషన్లను పెంచడం కోసం తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని స్వీకరించినట్టు అంగీకరిస్తూ కేంద్ర గిరిజనశాఖ 2022 ఫిబ్రవరి 9న రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. అలాగే కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఫిబ్రవరి 11న రాష్ర్టానికి లేఖ అందింది.
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం వర్సెస్ ఎస్టీ మురళీధర్రావుకు మధ్య జరిగిన 2020 కేసును ఉటంకిస్తూ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలుపై 2022 మార్చి 7న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిత్వ శాఖ.. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖకు లేఖ రాసింది.