చివ్వెంల, మార్చి 25: రాంగ్రూట్ డ్రైవిం గ్ ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని ఇద్దరు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను కాపాడబోయి మ రొకరు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోళ్లబం డ తండా 365బీ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం వాల్యతండాకు చెందిన ధరావత్ సతీశ్ ఐలాపురం నుంచి రోళ్లబండ తండా వైపు బైక్పై రాంగ్ రూట్లో వెళ్తున్నాడు.
ఖ మ్మానికి చెందిన గౌరిశెట్టి వినయ్(27) బైక్పై ఖమ్మం నుంచి హైదరాబాద్కు వస్తుండగా రెం డు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యా రు. ఆ సమయంలో ఐలాపురం నుంచి వట్టిఖమ్మం పహాడ్ వైపు బైక్పై వెళ్తున్న ఆత్మకూర్ (ఎస్) లమండలం నశింపేటకు చెందిన ముల్కలపల్లి మధు (30) ప్రమాదంలో గాయపడ్డ వారిని కాపాడాలని దగ్గరుండి అంబులెన్స్లో ఎక్కించాడు. అనంతరం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని మధు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో గాయాలైన ఇద్దరిలో వినయ్ మృతిచెందాడు.