TSLPRB | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) అసంతృప్తితో ఉన్నది. ప్రతి అంశానికీ కమిటీలు వే సుకుంటూ పోతే.. భవిష్యత్లో పోటీ పరీక్షలు నిర్వహించలేమని తెలిసింది. ఈ క్రమంలో రేపో మాపో సుప్రీంకోర్టు మె ట్లు ఎక్కేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న డివిజన్ బెంచ్ తీర్పుపై కూడా టీఎస్ఎస్పీఆర్బీ అసంతృప్తితో ఉన్నట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇప్పటికే ఫలితాల విడుదల ఆలస్యమవడం తో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నిరాశకు లోనవుతున్నారని, మళ్లీ కమిటీ పేరుతో 4 వారాల గడువు కోరడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని బోర్డు భావిస్తున్నది. నిపుణుల కమిటీ చేసే సూచనలకు పిటిషనర్లు, పోలీసు ఉద్యోగ నియామకమండలి కట్టుబడి ఉండాలని షరతు విధించడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్టు బోర్డు అధికారులు భావిస్తున్నారు.
ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై టీఎస్ఎస్పీఆర్బీ ఉన్నతాధికారులు, న్యాయవాదులు ఇప్పటికే పలుమార్లు సింగిల్ బెంచ్కు, డివిజన్ బెంచ్కు విన్నవించినప్పటికీ హైకోర్టు నిపుణుల కమిటీకే మొగ్గు చూపింది. దీంతో ప్రతిదానికీ కమిటీలు వేసుకుంటూ పోతే ఇక భవిష్యత్లో పరీక్షలు నిర్వహించడం ఎలా? అని బోర్డు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో కూడా పార్ట్-1 పరీక్షలో 7 ప్రశ్నలకు ఇచ్చి న ఆప్షన్లలో ఒకటి కంటే ఎకువ సరైన సమాధానాలు ఉ న్నాయి. అయితే, బోర్డు మాత్రం తాము నిర్ధారించుకున్న జవాబుల ప్రకారం మారులు వేసి తుది ఫలితాలు వెల్లడించింది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించా రు. వారి పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు.. బహుళ జవాబులున్న ప్రశ్నలకు అదనపు మారులు ఇవ్వాలని తీర్పు చెప్పింది. మరికొందరిని దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికచేశారు. ఈ నోటిఫికేషన్లో ఇప్పటికే నాలుగైదుసార్లు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు న్యాయనిపుణుల సలహా తీసుకుని సుప్రీంకోర్టును వెళ్లాలనేది బోర్డు నిర్ణయం.