హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 28: బీజేపీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ మాజీ అధ్యక్షుడు ఈగ మల్లేశం గురువారం మంత్రి కేటీఆర్ను కలిశారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాసర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రగతిభవన్లో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినందుకు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈయన వచ్చే నెల 6న మంత్రి కేటీఆర్ హనుమకొండ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరనున్నారు.