హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): పీజీ ఈసెట్ పరీక్షలు గురువారం సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంటెక్ ఆర్కిటెక్చర్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి మే 29 నుంచి గురువారం వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16,563 దరఖాస్తులు రాగా, 14,882 (89.85%) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
29న జియో ఇంజినీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేషన్, ఫార్మసీ, 30న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, 31న ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, టెక్స్టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజినీరింగ్, 1న ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ పరీక్షలు నిర్వహించారు.