జోగులాంబ గద్వాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో బర్రెలను(Buffalos) కడగడానికి వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల(Gadwala) మండలం సంగాలం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన కృష్ణయ్య(45) ఊరి సమీపంలోని చెరువు(Pond)లో తన బర్రెలను కడిగేందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కృష్ణయ్య ప్రమాదవశాత్తు చెరువుల్లో గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.