తలకొండపల్లి అక్టోబర్ 20: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు సబ్బండ వర్గాలకు అందుతున్నాయని ఆరెకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్జీ అన్నారు.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్యాదవ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్న బీఆర్ఎస్కు ఆరెకటికలు మద్దతు తెలుపుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతు అంగీకార పత్రాన్ని శ్రీనివాస్యాదవ్కు అందజేశారు.