హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జిలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2న సచివాలయంలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అదేరీతిన జిల్లాల ఇన్చార్జులు ఆయా జిల్లాల్లో జాతీయ జెండాను ఎగురవేసి దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు.