హైదరాబాద్, మార్చి 5 (నమస్తేతెలంగాణ):డీఈఈసెట్కు సంబంధించి మే 21, 22 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన వివరాలను గురువారం సెట్ డైరెక్టర్ వెల్లడించారు. ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 17, 18 తేదీల్లో ఎడిట్ ఆప్షన్కు అవకాశం కల్పించారు. మే 15 తర్వాత హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ ‘కీ’ని మే 25న విడుదల చేస్తారు. అదేరోజూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. మే 30న ఫలితాలు ప్రకటిస్తారు. జూన్ 1 నుంచి 6 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూన్ 6 నుంచి 8వరకు వెబ్ ఆప్షన్, జూన్ 9న ఎడిట్ ఆప్షన్కు అవకాశం కల్పించారు. జూన్ 14న సీట్ల కేటాయింపు పూర్తిచేస్తారు.