చిట్యాల : రాష్ట్రం ఏర్పడిన కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ రంగాలలో రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ జిల్లా చిట్యాలలోని తన వ్యవసాయ క్షేత్రంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మొక్కలు నాటిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడు. అదే సమయంలో వ్యవసాయం పండుగ లాంటిదని ప్రజలకు తెలియజేస్తూ రైతు సంక్షేమం కొరకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆ
కరోనా సమయంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపాడు అని అన్నారు.
బీజేపీ పాలనలో దేశ జి.డి.పి మైనస్కు పడిపోతే రాష్ట్ర జి.డి.పి మాత్రం రెండు అంకెలు చేరుకుందని, అది కేవలం కేసీఆర్ కృషి ఫలితమేననిఅన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ నీచమైన భాషను మార్చుకోవాలని అని సూచించారు.