సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ సీఐ రెచ్చిపోయాడు. అక్రమంగా కోదాడ మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో బడ్డీ కొట్టు తొలగించారని కోదాడ ప్రధాన రహదారిపై బాధితులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై సీఐ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. 200లకు పైనే షాపులు ఉండగా కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో పాటు షాపును ధ్వంసం చేసి తొలగించారు. దీంతో బాధితులు నిరసన వ్యక్తం చేస్తుండగా సీఐ ఇష్టారాజ్యంగా దాడి చేస్తూ స్టేషన్కు తరలించారు.