హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. గుజరాత్లోని అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో గురువా రం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయి తే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు మాత్రం రూ.600 కోట్లే కేటాయించారు. కేంద్రం నిర్వాకంపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. దక్షిణాది రాష్ర్టాలపై, మరీ ముఖ్యంగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదనటానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. కాచిగూడ, హైదరాబాద్, వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లకు కూడా కేంద్రం అన్యాయం చేసిందని మండిపడుతున్నారు.