హైదరాబాద్: చెన్నైలోని వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన థాయ్ ట్రేడ్ సెంటర్, రాయల్ థాయ్ గవర్నమెంట్ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహిస్తున్న ‘థాయ్లాండ్ వీక్ 2023’ ఎగ్జిబిషన్ రేపటితో ముగియనుంది. ఈ నెల 24న మొదలైన 27న ముగియనుందని నిర్వాహకులు వెల్లడించారు. థాయ్లాండ్ ఉత్పత్తులను పరిచయం చేయడం, వాటికి ప్రచారం కల్పించడంతోపాటు, భారత్-థాయ్లాండ్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందింపజేయడం లక్ష్యంగా ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నారు. ఈ ‘థాయ్లాండ్ వీక్ 2023’ ఎగ్జిబిషన్లో ఫ్యాషన్, గృహావసర, ఆరోగ్య రక్షణ, బ్యూటీ, పెంపుడు జంతువుల సంరక్షణ, ఆహార పానీయాలు మొదలు వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు.