హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, పెన్షనర్లకు 1శాతం చందాతో ఈహెచ్ఎస్ను అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం నాంపల్లిలోని టీజీవోభవన్లో సంఘం అత్యవసర సమావేశం నిర్వహించారు. టీజీవో అధ్యక్షురాలు వీ మమత మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక జీతభత్యాలు పొందేవిధంగా పీఆర్సీ ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే తరహాలో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు పీఆర్సీ కమిషన్ సూచన మేరకు 1శాతం చందాతో ఈహెచ్ఎస్ను అమలుచేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానించామని తెలిపారు. దంపతులైన ఉద్యోగులు ఒకే చోట పనిచేసేలా బదిలీలు చేపట్టాల ని మరో తీర్మానం చేసినట్టు పేర్కొన్నారు. సమావేశంలో సం ఘం ప్రధాన కార్యదర్శి ఎనుగుల సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్కుమార్, రవీందర్రావు, వెంకట్ గం డూరి, సుజాత, బీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
వేతనంలో ఒక శాతం చందాతో ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం (ఈహెచ్ఎస్) అమలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) కోరింది. శుక్రవారం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్ కుమార్ మంత్రిని కలిశారు. పథకం అమలు కోసం వేతనం నుంచి 2 శాతం చం దా చెల్లిస్తారని వార్తలు వస్తున్నాయని, ఇలాగైతే నష్టపోతామని ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. పీఆర్సీ కమిటీ సైతం ఒక శాతం చందానే సూచించిందని గుర్తుచేశారు. ఈ అంశంపై సానుకూల నిర్ణయానికి మంత్రి భరోసా ఇచ్చారని వారు చెప్పారు.