హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): దేవాలయాల పరిపాలనను డిజిటలైజ్ చేయడంలో భాగంగా దేవాలయ పరిపాలన సమాచార నిర్వహణ వ్యవస్థ(టీఏఐఎంఎస్)ను సమర్థంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన ముసాయిదా నియమావళిపై మంత్రి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, యాదగిరిగుట్ట అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.