హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర విద్యాశాఖ అమలుచేస్తున్న ‘పీఎం శ్రీ స్కూల్స్’ పథకానికి తెలంగాణ నుంచి 5,973 స్కూళ్లు పోటీపడుతున్నాయి. ఆయా స్కూళ్లను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు షార్ట్లిస్ట్ చేశారు. ఈ పథకంలో భాగంగా మండలానికి రెండు చొప్పున 1,204 స్కూళ్లు ఎంపికయ్యే అవకాశముంది. స్కూళ్ల ఎంపిక సహా దరఖాస్తు విధానంపై జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ సోమవారం ఓరియంటేషన్ నిర్వహించనున్నది. రాష్ట్రం నుంచి ప్రభుత్వ స్కూల్స్తోపాటు కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు కూడా ఈ పథకం కోసం పోటీపడనున్నాయి.
మూడు దశల్లో స్క్రీనింగ్
పాఠశాలలు ఆన్లైన్ పోర్టల్లో స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ స్కూళ్లు పోటీపడొచ్చు. మూడు దశల ఎంపిక ప్రక్రియ తర్వాత స్కూళ్లను ఎంపికచేస్తారు. మండలానికి ఒక ప్రాథమిక, ఒక సెకండరీ/ సీనియర్ సెకండరీ స్కూల్ చొప్పున రెండు బడులను ఎంపికచేస్తారు. ఎంపిక, పర్యవేక్షణ కోసం పాఠశాలను జియోట్యాగింగ్ చేస్తారు. రాబోయే ఐదేండ్లలో రూ. 27,360 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించనుండగా, కేంద్రం తన వాటాగా రూ.18,128 కోట్లు ఖర్చుచేయనున్నది. మొత్తం నిధుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూరుస్తాయి. ఈ పథకంలో భాగంగా బడులను హరిత పాఠశాలలుగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం సోలార్ ప్యానళ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్లాస్టిక్హ్రిత వ్యర్థ పదార్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, పోషకాహార తోటల పెంపకం, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతారు.
మార్గదర్శకాలు