వెంకటేష్, వరుణ్తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్ కథానాయికలు. కరోనా సెకండ్వేవ్ కారణంగా వాయిదా పడ్డ చిత్రీకరణను శుక్రవారం పునఃప్రారంభించారు. దిల్రాజు మాట్లాడుతూ ‘హైదరాబాద్లో షెడ్యూల్ ప్రారంభించాం. సెట్లో కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ చిత్రీకరణ జరుపుతున్నాం. వెంకటేష్, వరుణ్తేజ్తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. వినోదాల విందుగా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. “ఎఫ్-2’ చిత్రానికి మించిన నవ్వుల్ని పంచుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ను పూర్తిచేయాలనుకుంటున్నాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచనా సహకారం: ఎస్.కృష్ణ, అడిషినల్ స్క్రీన్ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.