హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్ ఓబీసీ సంక్షేమ కమిషన్ బృందంతో రాష్ట్ర బీసీ కమిషన్ బృందం బుధవారం భేటీ అయ్యింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణతోపాటు పలు అంశాలపై అధ్యయనం కోసం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు నేతృత్వంలో కమిషన్ సభ్యు లు బుధవారం భోపాల్కు వెళ్లారు. మధ్యప్రదేశ్ విధానసభ కమిటీ హాల్లో ఎంపీ ఓబీసీ కమిషన్ చైర్మన్ గౌరీశంకర్ బిసేన్, ఇతర సభ్యులను కలుసుకొన్నారు.
సుప్రీంకోర్టు సూచించిన ‘ట్రిపుల్ టెస్ట్’కు అనుగుణంగా ఆ రాష్ట్ర కమిషన్ అకడి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. నివేదికలోని ప్రాతిపదికలు, కొలమానాలు, మార్గదర్శకాల గురించి అడిగి తెలుసుకొన్నారు. అకడి కమిషన్ సమర్పించిన మొదటి నివేదిక ద్వారా ఎదురొన్న న్యాయపరమైన సమస్యలను ఎలా అధిగమించారనే అంశంపై సమాలోచనలు చేశారు. వకుళాభరణంను, సభ్యులు ఉపేంద్ర, శుభప్రద్పటేల్, కిషోర్గౌడ్లను మధ్యప్రదేశ్ ఓబీసీ కమిషన్ బృందం సత్కరించింది. గురువారం కూడా కమిషన్ బృందం పర్యటన కొనసాగనున్నది.