హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజును విద్యార్థులు ఈ నెల 17 వరకు చెల్లించాలని విద్యాశాఖ తెలిపింది.
రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 20 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉన్నదని వెల్లడించింది.