హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహమ్మారితో ముగ్గురు మృతి చెందగా.. మరో 2,444 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 39,520 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ రాష్ట్రంలో 97,579 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,372 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 94.20శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.