TS PECET 2023 | హైదరాబాద్ : టీఎస్ పీఈసెట్ – 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ కలిసి విడుదల చేశారు. పీఈసెట్ ఫలితాల్లో 96.50 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు.
బీపీఎడ్లో 96.65 శాతం, డీపీఎడ్లో 96.18 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు. బీపీఎడ్ ఫలితాల్లో జనగామకు చెందిన జీ దేవ ప్రథమ ర్యాంకు సాధించగా, డీపీఎడ్లో నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్ ప్రవళిక ప్రథమ ర్యాంకు సాధించారు. 16 బీపీఎడ్ కాలేజీల్లో 1660 సీట్లు, నాలుగు డీపీఎడ్ కాలేజీల్లో 350 సీట్లు ఉన్నట్లు పీఈసెట్ కన్వీనర్ వెల్లడించారు.