ఖైరతాబాద్, జూన్ 26: పత్రికారంగానికి విశేష సేవలందించిన సీనియర్ పాత్రికేయుడు గోవర్ధన సుందర వరదాచారి.. పాత్రికేయ భీష్మాచార్య అని వక్తలు కొనియాడారు. ఐదు దశాబ్దాలకుపైగా జర్నలిజంలో కొనసాగి తన రచనల ద్వారా ఎందరినో ప్రేరేపించి, అనేక మంది జర్నలిస్టులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన జీఎస్ వరదాచారి జీవన సాఫల్య అభినందన సభలో ఆయన రాసిన ‘పరిణత పాతిక్రేయం’ గ్రంథాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు డాక్టర్ కే శ్రీనివాస్, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు దాసు కేశవరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేవీ రమణాచారి మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పాత్రికేయ వృత్తిలో కొనసాగి వ్యక్తిగత జీవితాన్ని త్యాగంచేసిన వరదాచారి లాంటి వారికి సరైన గుర్తిం పు ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని చెప్పారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. గ్రామీణ విలేకరులకు ఆయన శిక్షణా తరగతులు నిర్వహించారని, యావత్ పాత్రికేయ సమాజానికి ఆయన గురువర్యులుగా ఉన్నారని పే ర్కొన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమాన్ని ఒక దశలో వరదాచారి ముందుండి నడిపించారని ఎంవీఆర్ శాస్త్రి గుర్తు చేశారు.