హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): సుస్థిర వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్గా మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ నా యకత్వంలోని ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, నిరంతర విద్యుత్తు, మిషన్ కాకతీయ వంటి అనేక చారిత్రాత్మక కార్యక్రమా ల అమలు వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శనివారం రైతు దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎకడా లేనివిధంగా తెలంగాణలో 58 శాతం జనాభా వ్య వసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఒక్క వ్యవసాయరంగంపైనే రూ.4.5 ల క్షల కోట్లు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. వ్యవసాయశాఖ కార్యదర్శి, వ్యవసాయ యూనివర్సిటీ ఇంచార్జి వీసీ రఘునందన్రావు సాగునీరు, రైతుబంధు, రై తుబీమా, విస్తరణ, గోదాంల నిర్మాణం, పం టల కొనుగోలు తదితర అంశాల్లో ఈ పదేండ్ల లో సాధించిన అభివృద్ధిని గణాంకాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొ ఫెసర్ ఘంటా చక్రపాణి, హార్టికల్చర్ కమిషనర్ హనుమంతరావు, ఆయిల్ పామ్ సలహాదారు శ్రీనివాసరావు, మారెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబా యి, పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎం వెం కటరమణ, విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.