హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్లు పొందేందుకు గడువును ఇంటర్బోర్డు ఈ నెల 9 వరకు పొడిగించింది. ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థులు రూ.1000 ఆలస్యరుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ కళాశాలల్లో ఎలాంటి రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చు.