హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాజధాని నలువైపులా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లలో సకల వసతులు లభించనున్నాయి. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ దవాఖానలకు ఎయిమ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తారు. నాలుగు టిమ్స్లను ఒక్కో స్పెషాలిటీ సేవలకు కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.
ప్రతి దవాఖానలో రెండు భవనాలు
ప్రతి దవాఖానలో రెండు భవనాలు నిర్మిస్తారు. ఒకటి ప్రధాన భవనంగా, మరొకటి అనుబంధ భవనంగా ఏర్పాటు చేస్తారు. రెండూ కలిపి 13,71,220 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ప్రధాన భవనాన్ని 10,53,800 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో, అనుబంధ భవనం 3,17, 420 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో నిర్మిస్తారు.
టిమ్స్ల్లో ఉండే ఏకరూప సదుపాయాలు
అల్వాల్: న్యూరో సైన్స్
అల్వాల్లో నిర్మించనున్న టిమ్స్ ‘న్యూరో సైన్స్’కు కేరాఫ్గా నిలువనున్నది. ఇది మిగతా దవాఖానల కన్నా భిన్నమైనది. రెండు టిమ్స్లో ఒకే ప్రధాన భవనం (జీ+14) నిర్మించనుండగా, అల్వాల్ టిమ్స్ మాత్రం రెండు భవనాలు జీ+5 చొప్పున నిర్మిస్తున్నారు.
మొత్తం విస్తీర్ణం: 28.41 ఎకరాలు
వ్యయం: రూ. 897 కోట్లు
ఎల్బీనగర్: గ్యాస్ట్రో సైన్స్
ఎల్బీనగర్లో నిర్మిస్తున్న టిమ్స్ గ్యాస్ట్రో సైన్స్ (జీర్ణాశయ సంబంధ వ్యాధులు) కేంద్రంగా మారనున్నది. ప్రధాన భవనాన్ని జీ+14 పద్ధతిలో
నిర్మిస్తారు.
మొత్తం విస్తీర్ణం: 21.36 ఎకరాలు
వ్యయం: రూ.900 కోట్లు
సనత్నగర్: కార్డియాక్ సైన్స్
గుండెకు సంబంధించిన ప్రత్యేక వ్యాధులు, చికిత్సలకు కేంద్రంగా ఎర్రగడ్డలో నిర్మించనున్న టిమ్స్ నిలువనున్నది. ఇక్కడ కూడా ప్రధాన భవనాన్ని జీ+14 పద్ధతిలో నిర్మిస్తారు.
మొత్తం విస్తీర్ణం: 60 ఎకరాలు
వ్యయం: రూ.882 కోట్లు