సర్కారు అండతో సాహస యాత్ర..
ఆవిర్భావ దినోత్సవాన ఎగరేసిన జాతీయ జెండా
కెరమెరి, జూన్ 2 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్గొంది అనే కుగ్రామానికి చెందిన ఆదివాసీ ముద్దు బిడ్డ మడవి కన్నీబాయి హిమాలయ పర్వతాన్ని అధిరోహించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గత నెల 14న హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆమె తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున 14,700 అడుగుల ఎత్తులో ఉన్న పనచరుల్లా (హిమాలయ) పర్వతంపై జాతీయ జెండా ఎగురవేసింది.
ఈ బృందంలో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన పాతకొట్ల ఉపేందర్ కూడా ఉన్నారు. తమకు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ ట్విట్టర్ ద్వారా అభినందించడం తమకెంతో స్ఫూర్తిని కలిగించిందని వారు పేర్కొన్నారు.