హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి ప్రకటించారు. త్వరలో బీజేపీలో చేరతానని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిలర్, చీటర్ అని ఆరోపించారు.
కాంగ్రెస్లో డబ్బున్నోళ్లకే పదవులు లభిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులపై అధిష్ఠానానికి పలుమార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని వాపోయారు. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ఓ దౌర్భాగ్యుడని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదని, ఇకపై ఆ పార్టీది మూడో స్థానమేనని పేర్కొన్నారు.