తెలంగాణ ప్రభుత్వం చెట్లను పరిరక్షించడం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రకృతిని పెంపొందించాలన్నా.. అడవులు పెంచాలన్నా.. వృక్ష సంపద.. జంతు సంపద పెరగాలన్నా ఖచ్చితంగా చెట్లను ఎక్కువగా పెంచాలి. అందుకే.. తెలంగాణకు హరిత హారం అనే ప్రోగ్రామ్ ద్వారా గత కొన్నేళ్లలో తెలంగాణలో ఇప్పటి వరకు 632 చదరపు కిలోమీటర్ల పరిధిలో అడవులు పెరిగాయి.
దానికి ఉదాహరణే ఈ ఫోటోలు. వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫర్ మున్నా మందాలపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వృక్ష, జంతు సంపదను అడవుల్లో తిరిగి మరీ క్లిక్మనిపించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి తెలంగాణ అడవుల్లో తచ్చాడుతున్న అరుదైన పక్షులు, జంతువుల ఫోటోలను క్లిక్మనిపించారు.
హరిత హారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.8260 కోట్లతో 241.5 కోట్ల మొక్కలను నాటారు. 10.3 లక్షల ఎకరాల అడవిని పునరుద్ధరించారు. ఇప్పటికే మున్నా.. అరుదైన జాతికి చెందిన ఎన్నో పక్షలు ఫోటోలను తీశారు. గత సంవత్సరం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో బొనెల్లి జాతికి చెందిన గద్ద ఫోటోను క్లిక్మనిపించారు.
దాని లైఫ్ సైకిల్పై డాక్యుమెంటరీ కూడా తీశారు. వరంగల్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాల్ వైల్డ్లైఫ్ సాంక్షువరీలో డస్కీ జాతికి చెందిన గుడ్లగూబ ఫోటో తీశారు. తెలంగాణకు వలస వచ్చిన పక్షి అది. నార్త్, నార్త్ ఈస్ట్లో ఈ జాతి పక్షులు ఎక్కువగా ఉంటాయి. అలా.. తన కెమెరాలో చాలా అరుదైన జాతికి చెందిన పక్షులను మున్నా ఫోటోలు తీశారు. వాటిలో కొన్నింటిపై ఓ లుక్కేయండి.