హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్రెడ్డి పదవీకాలం ఈ ఏడాది చివర్లో ముగియనున్నది. డిసెంబర్ 31న ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువా రం ఉత్తర్వులు జారీ చేశారు.
1962 డిసెంబర్ 3న జన్మించిన మహేందర్రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనతోపాటు ఐపీఎస్ అధికారి వీ శివకుమార్ కూడా అదే రోజు రిటైర్ కానున్నారు. రాష్ట్ర సీఐడీ డైరెక్టర్ జనరల్, 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గోవింద్సింగ్ ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు.